సంక్రాంతి పండుగగా గోవా పండుగ: టీడీపీ నేత సునీత

ABN , First Publish Date - 2022-01-29T21:57:55+05:30 IST

వైసీపీ నేతలపై అంగన్‌వాడీ విభాగం టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు

సంక్రాంతి పండుగగా గోవా పండుగ: టీడీపీ నేత సునీత

గుంటూరు: వైసీపీ నేతలపై అంగన్‌వాడీ విభాగం టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్రాంతి పండుగను గోవా పండుగగా చేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, పేకాటలు, కేసినో విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. జగన్ కంటే ముందుగా వచ్చే జగన్ గన్ ఎక్కడకు పోయిందని ఆమె ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఆడబిడ్డలపై వైసీపీ నేతలు అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ నేతలను మహిళలు చెప్పులు, చీపుర్లతో తరిమి కొట్టే రోజులు వచ్చాయని ఆమె తెలిపారు. హోం మంత్రి, మహిళా కమిషన్ రబ్బర్ స్టాంపులుగా మారారని ఆమె ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-01-29T21:57:55+05:30 IST