మత్తు పదార్థాలకు కేంద్రంగా ఏపీ: Somireddy

ABN , First Publish Date - 2021-10-25T17:41:24+05:30 IST

రాష్ట్రం మత్తు పదార్థాల కేంద్రంగా మారిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు.

మత్తు పదార్థాలకు కేంద్రంగా ఏపీ: Somireddy

న్యూఢిల్లీ: రాష్ట్రం మత్తు పదార్థాల కేంద్రంగా మారిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ప్రశ్నించే వారి పైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటి పోయాయని అన్నారు. న్యాయ వ్యవస్థపైనా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సాధారణ పరిపాలన జరగటం లేదని విమర్శించారు. జగన్ పాలన వదిలేసి ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను, రాష్ట్ర ప్రజలను కాపాడాలని రాష్ట్రపతిని కోరబోతున్నామని తెలిపారు. రాష్ట్రం వల్లకాడుగా మారిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-25T17:41:24+05:30 IST