కలెక్షన్ ఏజెంట్గా సీఐ: గౌతు శిరీష
ABN , First Publish Date - 2021-12-11T22:06:54+05:30 IST
పశువుల మంత్రికి పలాస సీఐ కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నారని
అమరావతి: పశువుల మంత్రికి పలాస సీఐ కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నారని టీడీపీ నేత గౌతు శిరీష ఆరోపించారు. మద్యం ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్రెడ్డిని ప్రశ్నించగల దమ్ము పలాస సీఐ శంకర్రావుకి ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. పశువుల మంత్రి, డీఎస్పీ అండతో సీఐ శంకర్రావు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని శిరీష డిమాండ్ చేశారు.