కొల్లు రవీంద్రను ఇరికించేందుకు వైసీపీ కుట్ర: టీడీపీ నేత

ABN , First Publish Date - 2020-12-05T19:03:24+05:30 IST

మంత్రి పేర్నినానిపై దాడి కేసులో కొల్లు రవీంద్రను ఇరికించి వేధించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్ రెడ్డి ఆరోపించారు.

కొల్లు రవీంద్రను ఇరికించేందుకు వైసీపీ కుట్ర: టీడీపీ నేత

అమరావతి: మంత్రి పేర్నినానిపై దాడి కేసులో కొల్లు రవీంద్రను ఇరికించి వేధించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్ రెడ్డి ఆరోపించారు. విచారణల పేరుతో రవీంద్రకు నోటీసు ఇచ్చిన స్టేషన్‌కు రమ్మనడం వెనుక వైసీపీ ప్రభుత్వ హస్తం ఉందన్నారు. పనుల్లేక మంత్రి పేర్నినానిపై భవన నిర్మాణ కార్మికుడు నాగేశ్వరరావు దాడికి పాల్పడ్డాడని... ఆ కేసును టీడీపీ నేతలకు ఆపాదించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా టీడీపీ నాయకులకే ముడిపెడతారా అని ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2020-12-05T19:03:24+05:30 IST