ప్రసన్నకు చంద్రబాబును విమర్శించే హక్కు లేదు: శ్రీనివాసులరెడ్డి
ABN , First Publish Date - 2020-09-20T15:54:35+05:30 IST
చంద్రబాబు నాయుడు గారి బిక్షతో నాలుగు సార్ల గెలిచిన ప్రసన్నకు బాబును విమర్శించే నైతిక హక్కు లేదని కోవూరు తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించారు.
నెల్లూరు: చంద్రబాబు నాయుడు గారి బిక్షతో నాలుగు సార్ల గెలిచిన ప్రసన్నకు బాబును విమర్శించే నైతిక హక్కు లేదని కోవూరు తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి కోసం జగన్ రెడ్డి ప్రసన్నం కోసం చంద్రబాబు నాయుడుని తిట్టడం చేస్తున్న దుర్మార్గుడు ప్రసన్న అని మండిపడ్డారు. ఎన్ని సార్లు చెప్పినా తన భాషలో, బుద్ధిలో మార్పు లేకుండా ఉన్న సమస్యలను పక్కనపెట్టి బాబునామ జపం చేయనదే పూట గడవని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న మర్యాదగా బాబుకు క్షమాపణ చెప్పాలని శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు.