సీఐడీ ఆరోపణ పచ్చి అబద్ధం: Pattabhi
ABN , First Publish Date - 2021-12-23T18:53:28+05:30 IST
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్పై బురదజల్లి లక్షలాది యువత భవితను చీకట్లపాలు చేసేలా సీఐడీ వ్యవహరిస్తోందని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు.
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్పై బురదజల్లి లక్షలాది యువత భవితను చీకట్లపాలు చేసేలా సీఐడీ వ్యవహరిస్తోందని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. సిమెన్స్ డిజైన్ టెక్ ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండా కోట్లరూపాయలు దిగమింగారన్న సీఐడీ ఆరోపణ పచ్చి అబద్ధమన్నారు. కాలేజీల్లో స్టాక్ రిజిస్టర్ల వివరాలు బయటకువస్తాయనే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ తొలగించారని పట్టాభి వ్యాఖ్యలు చేశారు.