‘వృద్ధులను మోసం చేసిన సీఎంగా జగన్ చరిత్ర నిలిచిపోతారు’

ABN , First Publish Date - 2021-10-07T17:51:19+05:30 IST

వృద్ధులను మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు.

‘వృద్ధులను మోసం చేసిన సీఎంగా జగన్ చరిత్ర నిలిచిపోతారు’

అమరావతి: వృద్ధులను  మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఫించన్ రూ.3 వేలు పెంచుతామని చెప్పి మూడేళ్లు కావొస్తున్నా.. కనీసం రూ.300 కూడా పెంచకపోగా కుంటి సాకులు చెబుతూ ఉన్న ఫించన్లు కోత కోసి వృద్దుల కడుపు మాడుస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే అంటూ పెన్షన్ వృద్ధుల నోటి దగ్గర కూడును కూడా లాక్కోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక్కరికే ఫించన్ అని, ఫించన్ ఇచ్చే సమయానికి ఇంట్లోనే ఉండాలని పలు నిభంనదలు పెట్టి ఫించన్లు తొలగించటం సిగ్గుచేట్టని అన్నారు. జగన్ రెడ్డికి ఆదాయం సృష్టించడం చేతకాక, పాలన అంటే ఏంటో తెలియక పేదల పెన్షన్లను పీకేస్తున్నారని ఆరోపించారు. ఆ పథకానికి వైఎస్ఆర్ భరోసా అనే పేరు తీసి జగన్ రెడ్డి నమ్మక ద్రోహమని పేరు పెట్టండని పంచుమర్తి హితవుపలికారు. గతంలో ప్రతి ఒక్క పెన్షన్ దారుడికీ.. ప్రతినెలా ఒకో తారీఖున వారి వారి ఖాతాల్లో సొమ్ము జమయ్యేది. ఇప్పుడు.. అసలు పెన్షనే దక్కే పరిస్థితి లేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రూ.200 ఉన్న పెన్షన్ ఒక్కసారిగా రూ.2000 చేశారని... కానీ జగన్  పెంచుతానన్న రూ.వెయ్యికి రెండున్నరేళ్లుగా దిక్కులేదన్నారు. చంద్రబాబులా రూ.1800 పెంచాల్సి వస్తే.. ఎన్ని దశాబ్దాల సమయం తీసుకునేవారోనని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇకనైనా వృద్ధులను మోసం చేయటం మాని తొలగించిన ఫించన్లు పునరుద్దరించాలని పంచుమర్తి అనురాధ అన్నారు. 

Updated Date - 2021-10-07T17:51:19+05:30 IST