వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ నేత నజీర్
ABN , First Publish Date - 2021-08-03T23:43:41+05:30 IST
వైసీపీ నేతలు, మంత్రుల వ్యవహారశైలిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం
విశాఖ: వైసీపీ నేతలు, మంత్రుల వ్యవహారశైలిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత గౌతు శీరిషపై సోషల్ మీడియా వేదక ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళ నేతలను కించపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్దతి కాదని నజీర్ సూచించారు.