ఆర్కే ఒక సైకో ఎమ్మెల్యే: లోకేష్‌

ABN , First Publish Date - 2021-12-23T00:05:44+05:30 IST

సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకుడు నారా

ఆర్కే ఒక సైకో ఎమ్మెల్యే: లోకేష్‌

గుంటూరు: సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌రెడ్డి ఒక సైకో సీఎం అని, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఒక సైకో ఎమ్మెల్యే అని ఆయన ఆరోపించారు. మంగళగిరిలో లోకేశ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ జగన్‌రెడ్డి జననేత అయితే ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వొచ్చు కదా అని నిలదీశారు. 


మంగళగిరి నియోజకవర్గంపై ఎమ్మెల్యే ఆర్కే కక్ష గట్టారని ఆయన ఆరోపించారు. మంగళగిరిలో పెన్షన్లు తీసేశారు, ఇళ్లను కూల్చుతున్నారన్నారు. జగన్ ప్రజావేదికను కూల్చారని, ఎమ్మెల్యే ఆర్కే ఇళ్లు కూల్చుతున్నారని ఆరోపించారు. అప్పు చేసిన 3 లక్షల కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఒక్క అభివృద్ధి చూపగలరా అని ABNతో లోకేష్‌ అన్నారు. కొట్టించి వీడియోలు చూసే సైకో మనస్తత్వం ఉన్న నేత జగన్‌రెడ్డి అని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం గెలుపు టీడీపీదేనని ABNతో లోకేష్‌ అన్నారు. 


Updated Date - 2021-12-23T00:05:44+05:30 IST