తాడేపల్లిలో జగన్ దాక్కున్నారు: లోకేష్
ABN , First Publish Date - 2021-09-01T21:52:42+05:30 IST
పోలవరం నిర్వాసితులకు భయపడి తాడేపల్లిలోని తన ఇంట్లో సీఎం జగన్ దాక్కుంటున్నారని
తూర్పు గోదావరి: పోలవరం నిర్వాసితులకు భయపడి తాడేపల్లిలోని తన ఇంట్లో సీఎం జగన్ దాక్కుంటున్నారని టీడీపీ నాయకుడు నారా లోకేష్ ధ్వజమెత్తారు. కేంద్రానికి జగన్ లేఖలు రాసి నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. నిర్వాసితుల కోసం సీఎం జగన్ మాట్లాడటం లేదని పార్లమెంట్లో చెబుతున్నారన్నారు. నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షంతో భేటీ అవుతామన్నారు. అందరినీ కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని లోకేష్ హెచ్చరించారు.
జిల్లాలోని దేవిపట్నం మండలం పెదవేంపల్లిలో నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడి పునరావాస కాలనీని ఆయన పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవంటూ నిర్వాసితులు గగ్గోలు పెట్టుకున్నారు.