జగన్ గారూ! మీ దిశ చట్టం దిశ తప్పిందా: నారా లోకేశ్
ABN , First Publish Date - 2020-06-07T03:31:49+05:30 IST
గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఒక దళిత బిడ్డపై వైసీపీ గుండాలు దాష్టికానికి పాల్పడ్డారని..
అమరావతి: గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఒక దళిత బిడ్డపై వైసీపీ గుండాలు దాష్టికానికి పాల్పడ్డారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ అమలు చేస్తున్న రాజా రెడ్డి రాజ్యాంగంలో దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. వైసీపీ నాయకుల అవినీతికి సహకరించలేదని.. దళిత మహిళా డాక్టర్ అనితా రాణిని వేధించడం దారుణమన్నారు.
‘‘జగన్ గారూ! మీ దిశ చట్టం దిశ తప్పిందా?. అన్యాయం జరిగింది అంటూ ఒక దళిత చెల్లెలు పోలీస్ స్టేషన్కి వెళితే దిశ చట్టం నిందితులకు కొమ్ముకాయడం ఘోరం. చిత్తూరు జిల్లా పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. నిజాయితీగా వృత్తి ధర్మానికి కట్టుబడినందుకు బూతులు తిడుతూ, ఫోటోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలి.’’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.