య‌థా లీడ‌ర్ త‌థా కేడ‌ర్: నారా లోకేష్‌

ABN , First Publish Date - 2022-01-27T01:23:40+05:30 IST

వైసీపీ నేతలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో

య‌థా లీడ‌ర్ త‌థా కేడ‌ర్: నారా లోకేష్‌

అమరావతి: వైసీపీ నేతలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో య‌థా లీడ‌ర్ త‌థా కేడ‌ర్ అన్నట్లుగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాధ‌నం 43 వేల కోట్ల దోపిడీ కేసులో జ‌గ‌న్‌ ఏ-1 అయితే ఎంపీ మోపిదేవి ఏ-7 అని ఆయన పేర్కొన్నారు. పాల‌కులే నేర‌గాళ్లయితే వాళ్ల అనుచ‌రులు పాల్పడే ఘోరాల‌కు అంతులేద‌ని మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ రైట్‌హ్యాండ్ భూశంక‌ర్ నిరూపించాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక‌పై లైంగిక‌దాడికి పాల్పడిన భూశంక‌ర్ లాంటి వైసీపీ బూచోళ్లు రాష్ట్రంలో ఊరికొక‌డున్నాడని ఆయన అన్నారు. ఎన్ని నేరాలు చేసినా జ‌గ‌న్‌రెడ్డి కాపాడుతాడ‌నే ధైర్యం వ‌ల్లే ఈ అకృత్యాల‌కు అంతే లేకుండా పోతోందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-27T01:23:40+05:30 IST