పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో జగన్‌ను సాగనంపుతాం: Nakka Anand

ABN , First Publish Date - 2021-11-01T14:24:42+05:30 IST

విడిపోయిన ఏపీకి చంద్రబాబు సీఎంగా వ్యవహరించి అభివృద్ధిబాట పట్టించారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.

పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో జగన్‌ను సాగనంపుతాం: Nakka Anand

గుంటూరు: విడిపోయిన ఏపీకి చంద్రబాబు సీఎంగా వ్యవహరించి అభివృద్ధిబాట పట్టించారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్టాన్ని బ్రష్టుపట్టించారని విమర్శించారు. ఎన్నికల ముందు రాజధాని అంశంపై  ప్రజలను నమ్మించారని... రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని మండిపడ్డారు. రాజధాని కోసం 600 రోజులకు పైగా రైతులు, మహిళలు ఉద్యమం చేస్తున్నారన్నారు. ఉద్యమం చేసే వారిని జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధించారని తెలిపారు. ఒక రాజధాని కోసం ఇన్ని రోజులు ఉద్యమం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. ప్రభుత్వ ఉగ్రవాదం పేరుతో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ రెడ్డిదన్నారు. పొట్టి శ్రీరాములు స్పూర్తితో పోరాటం చేసి జగన్ రెడ్డిని సాగనంపుతామని ఆనంద బాబు అన్నారు. 

Updated Date - 2021-11-01T14:24:42+05:30 IST