జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు: Nakka Anand

ABN , First Publish Date - 2021-08-28T17:14:20+05:30 IST

ఒక్క చాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.

జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు: Nakka Anand

గుంటూరు: ఒక్క చాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను జగన్  మోసం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరన్నారు. చేసుకోవడానికి పనులు లేవని, తినడానికి తిండి లేదని తెలిపారు. కూరగాయలు , నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. జగన్ రెడ్డి కి పాలన చేత కావడం లేదని, మంత్రులకు వారి శాఖలపై అవగాహన లేదన వ్యాఖ్యానించారు. ప్రతి పక్షాలను బూతులు తిట్టడమే మంత్రుల పనిగా ఉందని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం జగన్ రెడ్డి కి పట్టడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయిల్ ధరలు పెంచారన్నారు. మరల మహిళలతో కట్టెల పోయ్యిలతో వంటలు చేయించేలా జగన్ పాలన ఉందని దుయ్యబట్టారు. జగన్ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని నక్కా ఆనంద్ బాబు అన్నారు. 

Updated Date - 2021-08-28T17:14:20+05:30 IST