పనికిమాలిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: నక్కా ఆనంద‌బాబు

ABN , First Publish Date - 2022-03-04T18:39:33+05:30 IST

రాజధానిపై హైకోర్టు తీర్పుతో 5 కోట్ల ఆంధ్రులు పండుగ చేసుకున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.

పనికిమాలిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: నక్కా ఆనంద‌బాబు

అమరావతి: రాజధానిపై హైకోర్టు తీర్పుతో 5 కోట్ల ఆంధ్రులు పండుగ చేసుకున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేయడానికే కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. అందరికీ అనుకూలంగా ఉంటుందన్న ఒకే ఒక కారణంతో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలిపారు. వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రికి చట్టాలు అంటే గౌరవం లేదన్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారని అన్నారు. అమరావతి ఉద్యమం పాఠ్య పుస్తకాల్లో లిఖించదగ్గ ఉద్యమమని చెప్పారు. పనికిమాలిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-03-04T18:39:33+05:30 IST