జగన్ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి: Nakka Anand

ABN , First Publish Date - 2021-11-14T17:39:41+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.

జగన్ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి: Nakka Anand

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. శావల్యాపురం మండలం జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో నక్కా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచక పాలనకు చరమ గీతం పాడాలన్నారు. మోసపూరిత మాటలతో గద్దె నెక్కారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ‘‘మీ ఓటు ద్వారా జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి’’ అని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు కోరారు. 

Updated Date - 2021-11-14T17:39:41+05:30 IST