మీకు విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా?... విద్యా వ్యాపారాలు ముఖ్యమా?: మంతెన

ABN , First Publish Date - 2022-01-20T15:48:06+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అహంకారంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు.

మీకు విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా?... విద్యా వ్యాపారాలు ముఖ్యమా?: మంతెన

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  అహంకారంతో  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్, మంత్రులు ఇల్లు దాటి బయటకు రారు, కానీ విద్యార్థులు  పాఠశాలలకు రావాలా?  అని ప్రశ్నించారు. దేశంలోని 12 రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులిస్తే ఏపీలో సెలవులివ్వడానికి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి వచ్చిన ఇబ్బందేoటి ? అని నిలదీశారు. పాఠశాలలకు సెలవులిస్తే విద్యాశాఖ మంత్రి సొంత విద్యా సంస్థలకు నష్టం వస్తుందని సెలవులివ్వడం లేదా అని మండిపడ్డారు. ‘‘మీకు విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా? మీ విద్యా వ్యాపారాలు ముఖ్యమా ?’’ అని ప్రశ్నించారు. కరోనా బారినపడ్డ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారన్నారు. మరి విద్యార్థులకు కరోనా సోకితే ఎక్కడ చికిత్స తీసుకోవాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇకనైనా అహం వీడి తక్షణమే స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని  మంతెన సత్యనారాయణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-20T15:48:06+05:30 IST