గ్రూపులు వీడి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టండి

ABN , First Publish Date - 2022-06-26T04:10:53+05:30 IST

పట్టణంలోని నాయకులు గ్రూపులు వీడి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు క్యాడర్‌కు సూచించిరు.

గ్రూపులు వీడి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టండి
మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి

కావలి, జూన్‌ 25: పట్టణంలోని నాయకులు గ్రూపులు వీడి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు క్యాడర్‌కు సూచించిరు.  టీడీపీ పట్టణ కమిటీ సమావేశం శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో సుబ్బానాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో స్థానిక నాయకులు వారి వారి అభిప్రాయాలు వెల్లడించగా పట్టణంలో గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికాలని, గ్రూపులు కడితే సహించేది లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, కావలి నుంచి తానే పోటీ చేస్తానని, దానిపై అపోహలు వద్దని చెప్పారు. నాయకులు గ్రూపులు వదిలి సోమవారం నుంచి వార్డుల వారీగా బాదుడే బాదుడు, టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిరవధికంగా నిర్వహించాలన్నారు. వాటిపై క్యాడర్‌ దృష్టి పెట్టి అక్కడ తమ సత్తా ఏమిటో చూపించి పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, వార్డుల అధ్యక్ష కార్యదర్శులు, టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T04:10:53+05:30 IST