నిన్న గుప్తా.. నేడు వెంకట నారాయణ..: మాజీ మంత్రి మాకినేని
ABN , First Publish Date - 2021-12-22T01:04:09+05:30 IST
సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి
గుంటూరు: సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఒంగోలు జిల్లాలో సుబ్బారావు గుప్తాపై, నేడు గుంటూరు జిల్లాలో టీడీపీ నేత వెంకట నారాయణపై దాడి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భయం , భక్తి అనే మాటలకు అర్థం లేకుండా పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగా పని చేయడం లేదన్నారు. వైసీపీ నేతలు పోటీ పడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.
జగన్ రెడ్డి వద్ద మార్కుల కోసం నేతలు పోటీ పడుతున్నారన్నారు. వెంకట నారయణ ఆరోగ్య పరిస్థితి బాధాకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు సక్రమంగా పని చేయకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. హోం మంత్రి సుచరిత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. హోం మంత్రికి ఎంత పవర్ ఉందో వెంకట నారాయణ కేసులో చూపించాలని ఆయన సవాల్ విసిరారు.