ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలి: లోకేష్

ABN , First Publish Date - 2021-03-04T17:50:42+05:30 IST

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని తరమికొట్టాలని అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలి: లోకేష్

విశాఖపట్నం: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని తరమికొట్టాలని అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. గురువారం గాజువాకలో జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా లోకేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచుతూ పోతామన్న జగన్ ... సిమెంట్, ఇసుక, కరెంట్ ధర, పెట్రోలు నూనె ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. ఇంటి డోర్ ముందుకు రేషన్ సరుకులు అని నమ్మించి, బండి డోర్ తెరిస్తేనే సరుకులు ఇస్తున్నారని మండిపడ్డారు. విశాఖవాసులకు ఆదివారం వస్తే భయం వేస్తోందని... ఏ ఇంటి గోడకూలుస్తారో అనే భయం అని అన్నారు. రోడ్లకు గుంతలే పూడ్చలేదు కానీ...రాజధాని ఎలాతెస్తారంట అని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు కోసం పోరాటాలు చేసే దుస్ధితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోగా ఉక్కు కర్మాగారాన్ని కోల్పోయే దుస్ధితి వచ్చిందన్నారు. పది వాగ్దానాలతో ముందుకు వచ్చామన్నారు. ఇంటి పన్నులు సగం చేస్తామని తెలిపారు.  నీటి పన్ను విపరీతంగా పెంచారని ...టీడీపీ వస్తే నీటి పన్ను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏ2 వచ్చాకే భూదందాలు పెరిగాయని, అక్రమాలు పెరిగాయని లోకేష్ ఆరోపించారు. 

Updated Date - 2021-03-04T17:50:42+05:30 IST