కర్నూలులో లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

ABN , First Publish Date - 2020-10-23T14:09:59+05:30 IST

జిల్లాకు చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

కర్నూలులో లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

కర్నూలు: జిల్లాకు చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి అనంతపురం జిల్లాకు లోకేష్ బయలుదేరి వెళ్లారు.  వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆయన పరామర్శించనున్నారు. లోకేష్ పర్యటన నాలుగు నియోజకవర్గాల్లో సాగనుంది. ఆ మేరకు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-10-23T14:09:59+05:30 IST