తాత‌, తండ్రిని కోల్పోయిన ఇంట‌ర్ విద్యార్థికి లోకేష్ భ‌రోసా

ABN , First Publish Date - 2021-05-13T18:17:10+05:30 IST

కోవిడ్‌తో తాత‌య్య‌, తండ్రిని కోల్పోయిన ఇంట‌ర్ విద్యార్థి చెరుకూరి లోకేష్ కృష్ణకి అన్న‌గా అండ‌గా నిలుస్తాన‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భ‌రోసా ఇచ్చారు.

తాత‌, తండ్రిని కోల్పోయిన ఇంట‌ర్ విద్యార్థికి  లోకేష్ భ‌రోసా

అమరావతి: కోవిడ్‌తో తాత‌య్య‌, తండ్రిని కోల్పోయిన ఇంట‌ర్ విద్యార్థి చెరుకూరి లోకేష్ కృష్ణకి అన్న‌గా అండ‌గా నిలుస్తాన‌ని  టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భ‌రోసా ఇచ్చారు. లోకేష్ కృష్ణ చ‌దువు కొన‌సాగించేందుకు సాయం అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇంటర్ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ సంద‌ర్భంగా నిర్వ‌హించిన జూమ్ మీటింగ్‌లో జాయిన్ అయిన ఇంట‌ర్ సెకండియ‌ర్ విద్యార్థి చెరుకూరి లోకేష్ కృష్ణ మాట్లాడుతూ త‌న ఇంట్లో అంద‌రికీ కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని, తాత‌య్య ఒక‌చోట‌, నాన్న ఒక చోట చికిత్స పొందుతున్నార‌ని తాను కూడా కోవిడ్ బారిన‌ప‌డ్డాన‌ని, ప‌రీక్ష‌లు ఎలా రాయ‌గ‌ల‌న‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న లోకేష్ కృష్ణ జాతీయ మీడియాతో కూడా త‌న దుస్థితి వివ‌రించి, ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కోరాడు. అంతా వ‌ద్ద‌న్నా ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ‌కే ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉండ‌డంతో విద్యార్థుల ప్రాణాల ర‌క్ష‌ణ కోసం నారా లోకేష్ న్యాయ‌పోరాటం ఆరంభించారు. హైకోర్టు సూచ‌న‌ల‌తో ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు ప‌రీక్ష‌లు వాయిదా వేసింది. చెరుకూరి లోకేష్ కృష్ణ తాత‌య్య మ‌ల్లికార్జున‌రావు మే 7 న,  తండ్రి వెంకట సుబ్బారావు మే 9న కోవిడ్‌కి చిక్సిత పొందుతూ మృతి చెందారు. నాయనమ్మ, అమ్మ, లోకేష్ కృష్ణ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాత‌య్య‌, తండ్రిని కోల్పోయిన ఇంట‌ర్ విద్యార్థి లోకేష్ కృష్ణ‌కి అండ‌గా ఉంటాన‌ని లోకేష్ హామీ ఇచ్చారు. క‌రోనా మ‌హ‌మ్మారికి కుటుంబ పెద్ద‌ల్ని కోల్పోయిన విద్యార్థికి అన్న‌గా అండ‌గా వుంటాన‌ని భ‌రోసా నింపారు.

Updated Date - 2021-05-13T18:17:10+05:30 IST