అన్న‌దాత‌లంటే అంత అలుసా..నారా లోకేష్

ABN , First Publish Date - 2021-07-09T04:10:47+05:30 IST

రాష్ట్రంలోని అన్న‌దాత‌లంటే అంత అలుసా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావు గారూ అని టీడీపీ జాతీయ

అన్న‌దాత‌లంటే అంత అలుసా..నారా లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని అన్న‌దాత‌లంటే అంత అలుసా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావు గారూ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. అధికార‌ మ‌దంతో విర్ర‌వీగుతూ రైతుల్నే బెదిరిస్తారా అని లోకేష్  నిలదీశారు. అష్ట‌క‌ష్టాలు ప‌డి రైతులు తాము పండించిన ధాన్యం అమ్ముకుని మూడు నెల‌లైనా డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని అడిగితే వారినే తిరిగి బెదిరిస్తారా అని ప్రశ్నించారు. ఇదేమి అరాచ‌క ప్ర‌భుత్వం అని అన్నారు.


వ్య‌వ‌సాయ‌రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసి, రైతు బ‌తుకు దిన‌దిన‌గండంగా మార్చేసిన జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంలో రైతు దినోత్స‌వం అంటే, ప్ర‌శ్నించిన రైతుల్ని అవ‌మానించి దౌర్జ‌న్యం చేయ‌డ‌మా అని ఆయన నిలదీశారు. అన్న‌దాత‌ల్ని స‌న్మానించాల్సిన చోట అవ‌మానిస్తారా అని ఆయన ప్రశ్నించారు. స‌భ‌లోనే రైతుల్ని బెదిరించిన ఎమ్మెల్యే త‌క్ష‌ణ‌మే వారికి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ధాన్యం బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాలన్నారు. లేదంటే అన్న‌దాత‌ల‌కు అండ‌గా వైసీపీ ప్ర‌భుత్వం, ఎమ్మెల్యేల‌కు బుద్ధి చెప్పేవ‌ర‌కూ తెలుగుదేశం పోరాడుతుందని లోకేష్ హెచ్చరించారు. 

Updated Date - 2021-07-09T04:10:47+05:30 IST