ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తాం: లోకేష్
ABN , First Publish Date - 2021-08-29T02:03:07+05:30 IST
ప్రభుత్వ తనను ఎంత ఇబ్బంది పెట్టినా భవిష్యత్తులో ప్రజా సమస్యలపై
అనంతపురం: ప్రభుత్వ తనను ఎంత ఇబ్బంది పెట్టినా భవిష్యత్తులో ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. కనేకల్ పోలీస్స్టేషన్ నుంచి మాజీమంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు వదిలి పెట్టారు. శ్రీనివాసులును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫోన్లో పరామర్శించారు. పోలీసులు వ్యవహరించిన తీరును లోకేష్కు కాలవ వివరించారు. రాజ్యాంగ విలువలను అధికారులు కాలరాస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పోరాటం సాగిస్తామని లోకేష్ పేర్కొన్నారు.