
అమరావతి: వీఓఏ నాగలక్ష్మిది ఆత్మహత్య కాదని... జగన్ రెడ్డి పార్టీ నేత చేసిన హత్య అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుత... కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి వీఓఏ నాగలక్ష్మి తాము చెప్పినట్టు వినడంలేదని వైసీపీ నేత నరసింహారావు వెంటాడి వేధించడంపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఆమె బలవన్మరణానికి పాల్పడేది కాదన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా వైసీపీ నేత నుంచి మహిళని రక్షించలేకపోయారంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతగా భ్రష్టు పట్టిందో తెలుస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలకి రక్షకులుగా ఉంటారని, ప్రజల్నే భక్షిస్తారని కాదన్నారు. సొంత చెల్లెలిని తెలంగాణ తరిమేసి, బాబాయ్ని చంపేసి ఆయన కుమార్తె ప్రాణాలకు రక్షణలేకుండా చేసిన జగన్రెడ్డిని ఆదర్శంగా తీసుకుని గ్రామస్థాయిలో కూడా వైసీపీ నేతలు మహిళల ప్రాణాలు తీసేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చుట్టంగా చేసుకున్న వైసీపీ నేతల అరాచకాలకు పోలీసులకు అండగా వున్న పరిస్థితుల్లో ప్రజలంతా కలిసి తిరుగుబాటు చేస్తేనే ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ దొరుకుతుందని లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి