సత్యసాయి జిల్లా రోడ్డు ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది: Lokesh

ABN , First Publish Date - 2022-06-30T15:54:13+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడి ఐదుగురు మృతి చెందిన ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని

సత్యసాయి జిల్లా రోడ్డు ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది: Lokesh

అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై  హైటెన్షన్ విద్యుత్ తీగలు పడి ఐదుగురు మృతి చెందిన ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) అన్నారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-30T15:54:13+05:30 IST