అధికార పార్టీ నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోంది: Lokesh

ABN , First Publish Date - 2022-06-02T16:46:46+05:30 IST

అధికార పార్టీ నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

అధికార పార్టీ నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోంది: Lokesh

అమరావతి: అధికార పార్టీ నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయారని...  ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల‌పై వైసీపీ అసెంబ్లీ రౌడీలు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న అనుచ‌రుల బిల్లులు చేయ‌లేద‌ని పోలవరం ఏఈ సూర్యకిరణ్‌ను వైసీపీ రౌడీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొట్ట‌డం దారుణమన్నారు. మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇంజ‌నీరుపై దాడి జరిగినా ఎవరూ ఆపే ప్రయత్నం కూడా చెయ్యకపోవడం విచారకరమని తెలిపారు. ఉద్యోగుల హక్కులు, ప్ర‌యోజ‌నాల‌ కోసం పోరాడే ఉద్యోగ సంఘాల నాయకులు ఈ దాడి ఖండించ‌క‌పోవ‌డం అన్యాయ‌మే అని అన్నారు. ఏఈ సూర్య కిరణ్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దాడి చేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని తక్షణమే అరెస్ట్ చెయాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఏఈ సూర్య కిరణ్‌కు న్యాయం చేయాలని లోకేష్ అన్నారు. 


Updated Date - 2022-06-02T16:46:46+05:30 IST