మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలి: Lokesh

ABN , First Publish Date - 2022-05-31T15:39:01+05:30 IST

వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారని... అధికారులు బెదిరించి తెచ్చిన వారూ పారిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలి: Lokesh

అమరావతి: వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారని...  అధికారులు బెదిరించి తెచ్చిన వారూ పారిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) అన్నారు. ‘‘వాస్తవాలు రాసే, చూపించే మీడియా ప్రతినిధుల వీపు వాయగొడతారా మేయర్ గారు! ఇదేం రౌడీయిజం?. అధికారం మత్తులో నోరు పారేసుకోవద్దు. వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ ఉంటాయి. ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అని  నాలుగు కోట్లకి పైగా ఉన్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.  మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-05-31T15:39:01+05:30 IST