-
-
Home » Andhra Pradesh » tdp leader lokesh andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
ఫస్ట్రేషన్ పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టండి: Lokesh
ABN , First Publish Date - 2022-05-06T17:28:16+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కుళ్లు, కుతంత్రాలతో మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మాట్లాడడం వల్ల మీకు, మీ నాయకులకు ఆత్మసంతృప్తి కలగొచ్చేమోకానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు జగన్ రెడ్డి గారు. మీరు మా పై అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్పై సొంత ఊరికి తీసుకెళ్ళాడు ఓ తండ్రి. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కిలోమీటర్లు బైక్పై సొంత గ్రామం కొత్తపల్లికి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది వైసిపి ప్రభుత్వం. ఫస్ట్రేషన్ పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టండి. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయి’’ అంటూ లోకేష్ హితవు పలికారు.