అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?: Lokesh

ABN , First Publish Date - 2022-04-26T18:00:54+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?: Lokesh

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం. నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ’’ అని ప్రశ్నించారు. చేతగాని పాలకుడు జగన్ రెడ్డి చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తిరుపతి రుయా ఆస్పత్రి నుండి బాలుడు జేసవా మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కావాలని వేడుకున్నా కనికరం చూపలేదని టీడీపీ నేత మండిపడ్డారు.


ప్రైవేట్ అంబులెన్స్‌ల ధరలు తట్టుకోలేక బైక్ పైనే రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు 90 కి.మీ.మేర బాలుడి మృతదేహాన్ని తండ్రి తరలించారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-26T18:00:54+05:30 IST