పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదంపై లోకేష్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2022-04-14T13:50:58+05:30 IST

ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదంపై లోకేష్ దిగ్భ్రాంతి

అమరావతి: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలి 6 గురు సజీవదహనం అవ్వడం బాధాకరమన్నారు. తీవ్రంగా గాయపడిన 12 మందికి మెరుగైన వైద్య సహాయం అందించాలని తెలిపారు. ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం వలనే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతూ అమాయకులను బలితీసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారరు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలని లోకేష్ హితవుపలికారు. 

Updated Date - 2022-04-14T13:50:58+05:30 IST