ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ రావడం చాలా సంతోషకరం: లోకేష్
ABN , First Publish Date - 2021-01-26T17:07:09+05:30 IST
దివంగత సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డు రావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.
అమరావతి: దివంగత సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డు రావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘అద్భుత గాన ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కీ.శే. బాలసుబ్రహ్మమణ్యంగారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషకరం. ఈ వార్త విన్న ప్రతి తెలుగు హృదయం గర్విస్తోంది. అలాగే పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు ప్రముఖులు.. ఏపీకి చెందిన వయోలిన్ కళాకారులు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి, సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్రావు, తెలంగాణకు చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుగార్లకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ లోకేష్ పేర్కొన్నారు.