సర్పంచ్ మాధవీలత మరణం బాధాకరం: లోకేష్
ABN , First Publish Date - 2021-05-11T19:13:20+05:30 IST
తెలుగుదేశం పార్టీ నాయకురాలు, పెదకాకాని గ్రామ సర్పంచ్ మండే మాధవీలత మరణం
అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, పెదకాకాని గ్రామ సర్పంచ్ మండే మాధవీలత మరణం బాధాకరమని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ అన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా విజయం సాధించిన మాధవీలత అతి కొద్దిరోజుల్లోనే కరోనా బారినపడటం విషాదకరమన్నారు. వారి కుటుంబానికి లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.