Rakhi wishes: అక్కాచెల్లెళ్లు లేని నాకు ఆడపడుచులంతా సొంత సోదరీమణులే: లోకేష్
ABN , First Publish Date - 2022-08-11T17:48:01+05:30 IST
రాష్ట్ర ప్రజలందిరికీ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకష్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: రాష్ట్ర ప్రజలందిరికీ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకష్(Lokesh) రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సొంత అక్కాచెల్లెళ్లు లేని నాకు ఆడపడుచులంతా సొంత సోదరీమణులే అని అన్నారు. మీ అందరికీ అన్నలా అండగా..తమ్ముడిలా తోడుగా ఉంటాను. మీరు చూపించే అనురాగమే నాకు రక్ష. రాఖీ పండగ ముందు రోజే మంగళగిరిలో నా సోదరీమణులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు స్త్రీశక్తి పేరుతో శిక్షణ ఇప్పించి, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని లోకేష్ అన్నారు.