హిందువుల ఉత్సవాలపై వైసీపీ సర్కార్ చిన్నచూపు: కోటంరెడ్డి

ABN , First Publish Date - 2021-01-16T01:03:41+05:30 IST

పెన్నానదిలో పుష్కలంగా నీరున్నా, మైపాడు గేటు వద్ద జరిగే తెప్పోత్సవాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని

హిందువుల ఉత్సవాలపై వైసీపీ సర్కార్ చిన్నచూపు: కోటంరెడ్డి

నెల్లూరు: పెన్నానదిలో పుష్కలంగా నీరున్నా, మైపాడు గేటు వద్ద జరిగే తెప్పోత్సవాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికార పార్టీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల ఆలయాలు, ఉత్సవాలని వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. ఏటా నిర్వహించే తెప్పోత్సవానికి నీరు వదలకపోవడం దారుణం అన్నారు. మురుగునీటిలో పండుగ చేసుకోవాలా? కనీస సౌకర్యాలు కల్పించడంలో మంత్రి అనిల్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. జగన్ మెప్పు కోసమే మురుగునీటిలో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - 2021-01-16T01:03:41+05:30 IST