మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలి: Kollu ravindra

ABN , First Publish Date - 2022-01-18T18:16:07+05:30 IST

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానన్న హామీని సీఎం జగన్ మోహన్‌రెడ్డి విస్మరించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలి: Kollu ravindra

విజయవాడ: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానన్న హామీని సీఎం జగన్ మోహన్‌రెడ్డి విస్మరించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎన్టీఆర్ సొంత గడ్డ గుడివాడను జూదాలకు అడ్డాగా మార్చారని విమర్శించారు. ఎక్కడో ఉన్న క్యాసినో వ్యవస్ఖను గుడివాడకు తీసుకువచ్చి యువత పెడదోవ పట్టే విధంగా వ్యవహరించిన మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ఆయన తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం బస్టాండ్ సెంటరులోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి కొల్లు రవీంద్ర పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.


Updated Date - 2022-01-18T18:16:07+05:30 IST