టీడీపీ నేత రాజారావు కన్నుమూత
ABN , First Publish Date - 2021-03-06T16:34:13+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు(66)కన్నుమూశారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు(66) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజారావు హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చింతలపూడి నుంచి రాజారావు పోటీ చేశారు. రాజారావు మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలియజేశారు.