Kalva Srinivasulu ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-07-09T17:01:53+05:30 IST

రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.

Kalva Srinivasulu ఇంటి వద్ద ఉద్రిక్తత

అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు (Kalva srinivasulu) ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాల్వ నివాసానికి  టీడీపీ (TDP) శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. చలో బీటీ ప్రాజెక్టు పేరుతో గుమ్మగట్ట నుంచి పాదయాత్రకు కాల్వ పిలుపునిచ్చారు.  కాగా... పాదయాత్రకు అనుమతి లేదంటూ టీడీపీ నేత ఇంటి వద్ద భారీగా పోలీసులు (Police) మోహరించారు. బీటీ ప్రాజెక్ట్ పాదయాత్రకు బయలుదేరిన కాల్వను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ కాల్వ శ్రీనివాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 


కాగా... జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్ట్ పనులు గత మూడు సంవత్సరాలుగా ముందుకు సాగని పరిస్థితి నెలొంది.  ఈ క్రమంలో రైతులతో కలిసి గుమ్మగట్ట నుంచి బీటీ ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపట్టేందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సిద్ధమవగా... అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్దకు డీఎస్పీ నరసింగప్ప చేరుకున్నారు. 

Updated Date - 2022-07-09T17:01:53+05:30 IST