జగన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం: కాల్వ శ్రీనివాసులు

ABN , First Publish Date - 2022-02-23T00:43:49+05:30 IST

రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్ తీరును

జగన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం: కాల్వ శ్రీనివాసులు

అమరావతి: రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మూడేళ్ల పాలనలో పేదలకోసం జగన్‌రెడ్డి ఐదు ఇళ్లు మాత్రమే కట్టారని ఆయన ఆరోపించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఒక్కఇల్లు కూడా కట్టలేదని కేంద్రమే చెప్పిందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వడానికి జగన్‌రెడ్డికి ఎందుకంత విద్వేషం, నిర్లక్ష్యమన్నారు. టీడీపీ హయాంలో పూర్తైన ఇళ్లను కూడా పేదలకు జగన్‌రెడ్డి ఇవ్వడం లేదన్నారు. పేదలకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ మూడేళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలన్నారు. ఇళ్ల పేరుతో బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలను మభ్యపెడుతూ జగన్‌రెడ్డి వంచిస్తున్న తీరుని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. 

Updated Date - 2022-02-23T00:43:49+05:30 IST