అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు ధర్నా

ABN , First Publish Date - 2021-01-21T18:45:57+05:30 IST

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకట్రావు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధర్నాకు దిగారు.

అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు ధర్నా

అనంతపురం: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకట్రావు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధర్నాకు దిగారు. రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బైఠాయించి కాల్వ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ సర్కార్ రాజకీయ వేధింపులు మానుకోవాలన్నారు. కళా వెంకట్రావు అక్రమ అరెస్టు అన్యాయమని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు అరికట్టాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-21T18:45:57+05:30 IST