చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో సీఎం జగన్ హస్తం: kalva srinivasulu
ABN , First Publish Date - 2021-09-18T19:26:13+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక ఆటవిక పాలన సాగుతోందని అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక ఆటవిక పాలన సాగుతోందని అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడానికి సీఎం జగన్ హస్తం ఉందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దాడిలో ఏ వన్ ముద్దాయి జోగిరమేష్ అయితే ఏ టూ ముద్దాయి సీఎం జగన్ అని అన్నారు. ప్రతిపక్షనేత ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. దాడికి బారులు తీరిన కాన్వాయ్తో జోగి రమేష్ వస్తుంటే పోలీసులు ఏమి చేయకుండా ఉండిపోయారు ఈ చర్యతో సిగ్గు పడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటవిక రాజ్యాన్ని నెలకొల్పడానికి పోలీసులే సహకరిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ఆదేశిస్తేనే ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి చేయడానికి వెళ్లారిన కాలవ శ్రీనివాసులు అన్నారు.