రాజధాని అభివృద్ధికి ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదు?: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2022-05-03T17:39:59+05:30 IST

రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు.

రాజధాని అభివృద్ధికి ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదు?: కళా వెంకట్రావు

అమరావతి: రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి, సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకోవడానికి మాత్రం నిధులు ఉన్నాయా అని మండిపడ్డారు. కొద్దిపాటి నిధులను వెచ్చిస్తే  78 పూర్తి చేసిన ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, 69 శాతం పూర్తి అయిన ఐఎఎస్, 72 శాతం పూర్తైన గెజిటెడ్ అధికారలు నివాసాలు పూర్తయ్యేవని అని చెప్పుకొచ్చారు. రాజధానిపై ఈ ప్రభుత్వానికి దురుద్దేశం లేకుంటే ఆపేసిన నిర్మాణాలు ఎందుకు ప్రారంభించడం లేదని నిలదీశారు. రాజధానిలో టీడీపీ నిర్మించిన 5,028 ఇళ్లను పేదలకు ఇవ్వాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. 

Read more