కేవీపీకి మాత్రమే తెలుసు: జేసీ దివాకర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-15T21:14:22+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం రోశయ్య కేబినెట్‌లో తాను ఎందుకు

కేవీపీకి మాత్రమే తెలుసు: జేసీ దివాకర్‌రెడ్డి

అనంతపురం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం రోశయ్య కేబినెట్‌లో తాను ఎందుకు లేనో కేవీపీ రామచందర్ రావుకి మాత్రమే తెలుసని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేయలేకపోయానన్న బాధ ఇప్పటికీ తనను కలిచివేస్తోందని ఆయన పేర్కొన్నారు. దాదాపు సీఎంలు అందరి దగ్గరా తాను మంత్రిగా పనిచేశానని జేసీ తెలిపారు. 

Updated Date - 2021-12-15T21:14:22+05:30 IST