ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో భాగస్వాములు కావాలి: Jawahar

ABN , First Publish Date - 2021-11-13T14:47:49+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో భాగస్వాములు కావాలని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో భాగస్వాములు కావాలి: Jawahar

అమరావతి: ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో భాగస్వాములు కావాలని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ పిలుపునిచ్చారు. అవమానిస్తున్న ప్రభుత్వ విధానాలకు తమ ఓటుతో నిరసన తెలపాలన్నారు. సీపీయస్ రద్దు ఎప్పుడో తేల్చాలని, పీఆర్సీ ప్రకటించటానికి ఓటును ఆయుధంగా మల్చాలన్నారు. 7 డీఏల ప్రకటనకై పోస్టల్ బ్యాలెట్‌ను వేదికగా చేసుకోవాలని అన్నారు. జీతం, పీఆర్సీ, డీఏలు బిక్ష కాదు హక్కని చెప్పాలని ఆయన తెలిపారు. సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న జగన్‌కు ఉపాధ్యాయులు బుద్ధి నేర్పాలన్నారు. దళితులను మోసం చేసిన వైసీపీని వీడాలని అన్నారు. బెస్ట్, ఎవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ విద్యానిధి, కార్పోరేషన్ లోన్స్, వాహన యజమాని పధకాలకు తిలోధకాలు ఇచ్చిన వైసీపీకి వ్యతిరేకంకంగా ఓటెయ్యాలని కోరారు. ఈ ఎన్నికలను తమ హక్కుల పరిరక్షణకు వినియోగించుకోవాలని..పోస్టల్ బ్యాలెట్ ప్రభుత్వ వైఖరిని మార్చేవిధంగా ఉండాలని అన్నారు. దగాపడిన వర్గాల పోరాటానికి ఈ ఎన్నికలు వేదిక కావాలని జవహర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-13T14:47:49+05:30 IST