బెదిరింపులతో ఉద్యోగుల హక్కులు ఎలా కాలరాస్తారు?: Jawahar
ABN , First Publish Date - 2021-11-11T16:52:02+05:30 IST
బెదిరింపులతో ఉద్యోగుల హక్కులు ఎలా కాలరాస్తారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు.
అమరావతి: బెదిరింపులతో ఉద్యోగుల హక్కులు ఎలా కాలరాస్తారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. కంట్రోల్లో ఉండవలసిన అవసరం ఉద్యోగ సంఘ నాయకులకు ఎందుకు వచ్చిందని అన్నారు. సీపీఎస్ పేరుతో ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఫిట్మెంట్ 43% కన్నా 1% అయినా ఎక్కువివ్వాలన్నారు. పీఆర్సీ ఒక్కటే కాదు 100 పైగా సమస్యలకు పరిష్కారమెప్పుడో ప్రభుత్వం చెప్పాలని అన్నారు. ఎయిడెడ్ ఉద్యోగుల భవితవ్యం ఏమిటో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై మాట్లాడితే ప్రధానోపాద్యయ సంఘ నాయకుడిపై నోటిసులు బెదిరింపు దేనికి సంకేతమని ప్రశ్నించారు. భయం వీడి పోరాడాల్సిన సమయం వచ్చిందని జవహర్ అన్నారు.