అంతర్యుద్ధం జరగాలని జగన్ యత్నం: Jawahar
ABN , First Publish Date - 2021-10-20T15:05:01+05:30 IST
టీడీపీ కార్యాలయాలు, నాయకులపై దాడుల ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్మోహన్ రెడ్డి తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టుకోవాలని
ఏలూరు: టీడీపీ కార్యాలయాలు, నాయకులపై దాడుల ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్మోహన్ రెడ్డి తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్ విమర్శలు గుప్పించారు. నాయకులను హౌస్ అరెస్ట్ చేసి ఈ రోజు బంద్ను అడ్డుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు జరిగిన దాడిని అందరూ ఖండించాలని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకునిఈ ప్రభుత్వం పిరికిపంద చర్యలు చేస్తుందన్నారు. దమ్ము ధైర్యం లేక వైసీపీ నాయకులకు మందు పోయించి టీడీపీ కార్యాలయంలో దాడి చేయించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రస్టేషన్ ఫీలై ముసలం తప్పదని భావించి దాడులు చేస్తున్నారని జవహర్ వ్యాఖ్యానించారు.