జగన్ పెట్టిన నవరత్నాలు నవమోసాలు: GV
ABN , First Publish Date - 2022-06-21T18:45:01+05:30 IST
సీఎం జగన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు నవమోసాలు అని టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు.
పల్నాడు: సీఎం జగన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు నవమోసాలు అని టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఎన్నికల ముందు ఎన్ని ముద్దులు పెట్టాడు... ఇప్పడు ముద్దుకోక గుద్దు అన్నట్లు పాలన ఉంది’’ అని అన్నారు. జగనన్న కాలనీల పేరుతో ఎమ్మెల్యేలు దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాలనీలలో మౌలిక సదుపాయాల పేరుతో వైసీపీ నేతలు వందల కోట్లు దోచుకున్నారన్నారు. జగనన్న కాలనీలలో ఇల్లు కట్టుకోవాలంటే పేదలు అప్పులు చేయాల్సిందే అని అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో వైసీపీ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు భారతి సిమెం కొనడానికే చాలవన్నారు. ‘‘మీ ఇల్లు మీరే కట్టుకోండి మేం వచ్చి మా పార్టీ రంగులు వేస్తామన్నట్లు వ్యవహారం ఉంది’’ అంటూ జీవీ ఆంజనేయులు వ్యాఖ్యలు చేశారు.