Path holes: అడుగుకో గుంతతో.. గంటకో ప్రమాదం
ABN , First Publish Date - 2021-07-16T18:55:32+05:30 IST
జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై మాజీ ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు నిరసనకు దిగారు.
గుంటూరు: జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై మాజీ ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు నిరసనకు దిగారు. నుజండ్ల మండలం కమ్మవారి పాలెం వద్ద రోడ్డు గుంతలను పూడ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం కొత్తగా గుంతల పధకం పెట్టినట్లుగా ఉందని యెద్దేవా చేశారు. అడుగుకో గుంతతో.. గంటకో ప్రమాదం జరుగుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. మూడు గుంతలు పూడ్చలేని జగన్ మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు దోపిడి మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదని వ్యాఖ్యానించారు. తక్షణమే నియోజకవర్గంలో రోడ్లను మరమ్మత్తులు చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.