‘నభూతో నభవిష్యత్ అన్న విధంగా మహానాడు విజయవంతం చేస్తాం’

ABN , First Publish Date - 2022-06-27T18:07:23+05:30 IST

నభూతో నభవిష్యత్ అన్న విధంగా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు సభను విజయవంతం చేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.

‘నభూతో నభవిష్యత్ అన్న విధంగా మహానాడు విజయవంతం చేస్తాం’

గుడివాడ: నభూతో నభవిష్యత్ అన్న విధంగా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు  మహానాడు సభను విజయవంతం చేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. సోమవారం గుడివాడలో టీడీపీ నేతలు మీడియాత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... కరిఫ్‌లో కృష్ణా డెల్టా రైతాంగానికి జరిగే నష్టాన్ని గుర్తించిన రైతాంగం చంద్రబాబు సభలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 2020 నాటికి పోలవరం పూర్తి అన్న ప్రభుత్వం నేడు రైతాంగాన్ని నిండా ముంచిందని మండిపడ్డారు. చంద్రబాబుకు పేరు వస్తుందనే జగన్ ప్రభుత్వం పట్టిసీమను నిర్వీర్యం చేస్తోందన్నారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు వ్యవస్థలను పాతి పెట్టేస్తున్నారని విమర్శించారు. ఓపిక నశించి తప్పక చంద్రబాబు రోడ్డెక్కారని తెలిపారు. చంద్రబాబు సభలతో ఉత్తరాంధ్రలో వైసీపీ కనుమరుగు ఖాయమని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. 


లోహిత్ మాట్లాడుతూ... గుడివాడలో టీడీపీ పసుపు పండగ జరుగుతుందన్నారు. మహానాడు తర్వాత రాష్ట్ర రాజకీయం మారుతుందని చెప్పారు. మహానాడు అడ్డు కోవాలనుకునే శక్తులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇది గుడివాడ టీడీపీ మహానాడు కాదు కృష్ణా జిల్లా మహానాడు అని అన్నారు. కుటుంబంలో విభేదాలు సహజం పార్టీలో కూడా అంతే అని అన్నారు. 

Updated Date - 2022-06-27T18:07:23+05:30 IST