ఏపీ పోలీసులు ఇన్నిరోజులు కళ్లు మూసుకున్నారా?: గోరంట్ల

ABN , First Publish Date - 2021-09-18T14:20:19+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి ఆ పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఏపీ పోలీసులు ఇన్నిరోజులు కళ్లు మూసుకున్నారా?: గోరంట్ల

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి ఆ పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీ పోలీసులు ఇన్ని రోజులు కళ్లు చూసుకుని కూర్చున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షనేతపై ముఖ్యమంత్రి, మంత్రులు నీచమైన భాష ఉపయోగించినప్పుడు ఏమైంది...డీజీపీకి అది కనిపించలేదా అని మండిపడ్డారు. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు వాస్తవాలు చెబితే ఎందుకు భరించలేకపోతున్నారని నిలదీశారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో ఉంటారని, ఆ క్రమశిక్షణ తప్పితే తమకు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే తిరిగి రెండు చెంపల మీద కొట్టే సత్తా టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఉందన్నారు. ‘‘మా ఇంటికి దూరం ఎంతో మీ ఇంటికి దూరం అంతే అన్న సంగతి వైసీపీ నేతలు గుర్తు పెట్టుకుంటే మంచిది’’ అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-09-18T14:20:19+05:30 IST